ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతున్నా,ప్రజలకి ఒక్కమేలు చేసిన పాపాన పోలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 10:13 AM

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క‌ష్ట‌ప‌డే ప్ర‌తి ఒక్క‌రికీ జ‌గ‌న‌న్న 2.0లో ప్రాధాన్య‌త ఉంటుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ పేర్కొన్నారు.‘బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం మోసాలను ఇంటింటికి వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కోడుమూరు నియోజక‌వర్గంలోని సి బెళగల్ మండల వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం డాక్టర్ ఆదిమూలపు సతీష్ అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించారు.  ‘బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ’  రీకాలింగ్ చంద్ర‌బాబు మేనిఫెస్టో కార్య‌క్ర‌మంపై పార్టీ శ్రేణుల‌కు స‌తీష్ దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకం కూడా పూర్తి చేయలేదన్నారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలు లేవని, వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలను తాము చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.  కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, మాటలకు గ్యారెంటీ లేదని, చంద్రబాబు నాయుడు మోసగాడని అన్నారు. కూటమి పాలనలో చోటు చేసుకున్న అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి కార్యకర్త, నాయకులు తీసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa