ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా తరహాలో బ్యాంకుల్ని మోసం చేసిన ముఠా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 10:55 AM

నెల్లూరు జిల్లాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. నెల్లూరు, ముత్తుకూరు యాక్సిక్ బ్యాంకు బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకుని భారీ స్కాంకు పాల్పడ్డారు కొంతమంది మోసగాళ్లు. కుబేరా సినిమా తరహాలో రూ.15కోట్ల నుంచి రూ.20కోట్ల మేర అమాయకులకి టోకరా వేశారు. తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఇటీవల ఈ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. నిరుపేదలని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా చూపి రుణాలు తీసుకుంది ఈ మాఫియా. రుణాలు చెల్లించాల్సిందిగా బ్యాంకుల నుంచి పేదలకి నోటీసులు రావడంతో ఈ భాగోతం బయటపడింది. ఈ మాఫియాలో జాలే వాసుదేవ‌ నాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ కీలకంగా వ్యవహరించారు. ఈ మాఫియా కాజేసిన సొమ్ముతో సినిమాలు చిత్రీకరించారు. గతంలోనూ జర్నలిస్టు యూనియన్ పేరుతోనూ భారీ మొత్తాలు వసూలు చేశాడు జాలే వాసుదేవనాయుడు. ఏడు నెలల క్రితం నెల్లూరు పోలీసులకి ఫిర్యాదులు చేసి గోప్యంగా ఉంచారు బ్యాంకు అధికారులు. 2021 నుంచి 2024 మధ్య భారీఎత్తున మోసాలు జరిగినట్లు తెలుస్తోంది‌. సీబీఐతో విచారణ జరిపించాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa