చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని అనంతపురం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడిలో వైయస్ఆర్సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి హాజరై ఏడాదిగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి.. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పోస్టర్లు ఆవిష్కరించారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..`ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్తో పాటు 143 హామీలు ఇచ్చారు. ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేరకం. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలు మోసపోతూనే ఉన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది కాలంలో ఒక్క హామీని అమలు చేయలేదు. సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ప్రజలకు రూ.81 వేల కోట్లు బాకీ పడింది. ప్రజల పక్షాన వైయస్ఆర్సీపీ పోరాటం చేయడం వల్ల తల్లికి వందనం పథకాన్ని అరకొరగా అందించారు. ఇంకా లక్షలాది మందికి పథకం అందలేదు. 2024–25 సంవత్సరంలో తల్లికి వందనంను చంద్రబాబు ఎగ్గొట్టారు. రైతుకు ఆర్థిక సాయం అందించాలని కోరితే ‘మోదీ ఇస్తేనే’ నేను ఇస్తానని చంద్రబాబు అంటున్నాడు. నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందలేదు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామని ఇవ్వలేదు. భవిష్యత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తే రాజు.. వాళ్లు చెప్పిందే జరుగుతుంది. ఇది వైయస్ జగన్ మాట. ఎమ్మెల్యే ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు ఉన్నాయి. గతంలో ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే టీడీపీ నాయకులు బయటకు వచ్చారు. కానీ మనం ప్రజల తరఫున ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశాం. రాజకీయ పార్టీ గానీ, రాజకీయ నాయకులు, కార్యకర్తలు గానీ అధికారం కోసం మాత్రమే కాదు.. సమాజ అభ్యున్నతి కోసం పని చేయాలి అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa