ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డ రాయబారి పర్వతనేని హరీశ్

national |  Suryaa Desk  | Published : Wed, Jul 23, 2025, 04:29 PM

ఐక్యరాజ్యసమితి (యూఎన్) వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాకిస్థాన్‌ను "మతోన్మాదం, ఉగ్రవాదంలో కూరుకుపోయిన, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి సీరియల్ రుణగ్రహీత"గా అభివర్ణించింది. అంతర్జాతీయ శాంతి, భద్రతను ప్రోత్సహించడం, ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాల పరిష్కారం అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ)లో జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో భారత్ శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ -పాక్ దేశాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని హరీశ్ స్పష్టంగా ఎత్తిచూపారు. "ఒకవైపు భారతదేశం ఉంది.. పరిణితి చెందిన ప్రజాస్వామ్యం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, బహుళ సాంస్కృతిక, సమ్మిళిత సమాజం. మరోవైపు పాకిస్థాన్ ఉంది.. మతోన్మాదం, ఉగ్రవాదంలో మునిగి, ఐఎంఎఫ్ నుంచి పదేపదే రుణాలు తీసుకునే దేశం" అని దుయ్యబట్టారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనే ప్రాథమిక సూత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే, పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని పద్ధతుల్లో పాల్గొంటోందని, "అంతర్జాతీయ శాంతి, భద్రతను చర్చిస్తున్నప్పుడు పాకిస్థాన్ వంటి దేశం ఉపన్యాసాలు ఇవ్వడం సమంజసం కాదు" అని ఆయన తీవ్రంగా విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa