శ్రీసత్యసాయి జిల్లాలో పండగ వేళ తీవ్ర విషాదం జరిగింది. వేరుశెనగ గింజలు పసివాడి ప్రాణాన్ని తీశాయి. పిల్లవాడి కుటుంబం వరలక్ష్మీ వ్రతం కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. పిండివంటల తయారు చేస్తున్నారు.. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. పండగ వేళ ఆ కుటుంబం విషాదంలో మునిగింది. పెనుకొండ నగర పంచాయతీ పరిధిలో వెంకటరెడ్డిపల్లి ఉంది. ఆ ఊరికి చెందిన నాగరాజు, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు దీపక్కు రెండేళ్లు.
శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో సందర్భంగా ఇంట్లో పిండి వంటలు చేస్తున్నారు.. ఆ సమయంలో దీపక్ అటు వైపుగా వచ్చాడు.. అక్కడ వేయించిన వేరుశెనగ విత్తనాలు నోటికి పోసుకున్నాడు. అయితే ఆ వేరుశెనగ విత్తనాలు బాలుడి గొంతులో ఇరుక్కుపోయాయి.. పాపం పిల్లవాడు ఊపిరాడక ఇబ్బందిపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. పండగ రోజు కుమారుడి మృతితో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు.
హిందూపురం హత్యకేసు అప్డేట్
హిందూపురంలో జరిగిన హత్య కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపీర్కు దిల్షాద్తో 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. దాదాపీర్ హిందూపురం, కర్ణాటకలో దొంగతనాలు చేసేవాడు. ఆ డబ్బుతో స్నేహితులు పవన్, నరసింహా, ఇనాయతుల్లా, అఫ్రిద్లతో కలిసి మద్యం తాగుతూ ఎంజాయ్ చేసేవాడు. పవన్ కుమార్ అనే వ్యక్తికి, దాదాపీర్ భార్య దిల్షాద్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం దాదాపీర్కు తెలిసింది. దాంతో అతను దిల్షాద్ను, పవన్ను చాలాసార్లు హెచ్చరించాడు.. అయినా వాళ్ళు వినలేదు. అందుకే దాదాపీర్ను చంపేశారు అని పోలీసులు తెలిపారు.
దిల్షాద్ అనే మహిళ, తన ప్రియుడు పవన్ కుమార్తో కలిసి దాదాపీర్ను చంపడానికి కుట్ర చేశారన్నారు. దీని కోసం పవన్ స్నేహితులు నరసింహ, ఇనాయతుల్లా, అఫ్రిద్ల సహాయం తీసుకున్నారు. ఈ నెల 2న మధ్యాహ్నం 2 గంటలకు దాదాపీర్ను లేపాక్షి మండలం తిలక్నగర్ కాలనీలోని ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి, రాయితో కొట్టి చంపారు. దాదాపీర్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa