ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర పథకంతో మహిళలకు రూ.10 లక్షలు.. 2.75లక్షల మందికి మంజూరు

business |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 11:08 PM

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వ పలు రకాల పథకాలు అందిస్తోంది. అందులో ఒకటి స్టాండప్ ఇండియా పథకం. దీనిని మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్న వారు, ఇప్పటికే ఏదైనా వ్యాపారం చేస్తున్న మహిళలు, ఎస్సీ, ఎస్టీలు ఈ స్టాండప్ ఇండియా పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా సొంత వ్యాపారం చేసే మహిళలకు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు అందిస్తున్నారు. చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు నెలకొల్పాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటు వేదికగా కీలక ప్రకటన చేసింది.


స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గడిచిన 9 ఏళ్ల కాలంలో 2,75,291 మందికి రుణాలు ఇచ్చినట్లు తెలిపింది. వివిధ బ్యాంకుల ద్వారా వారికి రూ.62,791 కోట్లు మంజూరు చేసినట్లు పార్లమెంటులో మంగళవారం ఆగస్టు 19వ తేదీన ప్రకటించింది. ఈ స్టాండప్ ఇండియా స్కీమ్‌ను 2016, ఏప్రిల్ 5వ తేదీన ప్రారంభించింది కేంద్రం. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు సొంత వ్యాపారంలో రాణించేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ తీసుకొచ్చింది. బ్యాంకుల ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభకు తెలియజేశారు. ఒక షెడ్యూల్డ్ కమెర్షియల్ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా కనీసం ఒక మహిళకు లేదా ఎస్సీ, ఎస్టీ వర్గీయులకు రుణాలు ఇచ్చినట్లు చెప్పారు.


ఈ స్కీమ్ ద్వారా గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ ప్రైజెస్, మాన్యూఫాక్చరింగ్, సర్వీసె సెక్టార్స్, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర మం్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో పాటు గత ఆర్థిక ఏడాది 2024-25కి గానూ సవరించిన వడ్డీ సబ్సిడీ పథకం కింద స్వల్ప కాలిక పంట రుణాలకు, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ద్వారా రూ.17,811.72 కోట్లు రాయితీ ఇచ్చినట్లు చెప్పారు.


మీరు కూడా సొంత వ్యాపారం కోసం స్టాండప్ ఇండియాలో లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ వ్యాపారానికి 10-15 శాతం పెట్టుబడి పెడితే చాలు. మిగితాది కేంద్రం ద్వారా లోన్ రూపంలో పొందవచ్చు. 18 ఏళ్ల వయసు నిండిన మహిళలు అర్హులు. ఇప్పటికే వ్యాపారంలో ఉన్న వారు సైతం బిజినెస్ విస్తరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో 51 శాతం వాటా మహిళలు లేదా ఎస్సీ, ఎస్టీల పేరుపై ఉండాలి. గతంలో ఎలాంటి లోన్ డీఫాల్టర్ గా ఉండకూడదు. మంచి సిబిల్ స్కోర్ ఉండాలి. స్టాండప్ఇండియా అధికారిక పోర్టల్ https://www.standupmitra.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్ 18 నెలల పాటు మారటోరియం ఉంటుంది. అంటే కట్టక్కర్లేదు. ఆ తర్వాత 7 సంవత్సరాల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa