రైల్వే టికెట్ రిజర్వేషన్ విధానానికి సంబంధించి రైల్వే టికెట్ బుకింగ్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ రిజర్వేషన్ టికెట్లకు సైతం ఆధార్ అథెంటికేషన్ తప్పని సరి చేస్తున్నట్లు తెలిపింది. మొదటి 15 నిమిషాలు ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా టికెట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు వీలు లభిస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఇది తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై అక్టోబర్ 1, 2025 తేదీ నుంచి సాధారణ టికెట్ రిజర్వేషన్లకు సైతం వర్తింపు జేస్తున్నామని వెల్లడించింది.
ట్రైన్ టికెట్ ప్రస్తుతం 60 రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే, తత్కాల్ టికెట్ల మాదిరిగానే సాధారణ టికెట్ల బుకింగ్ ప్రారంభమైన వెంటనే అయిపోతున్నాయి. అక్రమార్కులు సాఫ్ట్వేర్ సాయంతో ట్రైన్ టికెట్లు బుక్ చేసేస్తున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులకు టికెట్లు దొరకడం లేదు. ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే రైల్వే రిజర్వేషన్ టికెట్లు అక్రమార్కుల చేతిలో పడకుండా సామాన్య యూజర్లకు ప్రయోజనాలు అందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే టికెట్ బుకింగ్ బోర్డు తెలిపింది. ఈ మేరకు అన్ని జోనల్ ఆఫీసులకు సమాచారం అందించినట్లు తెలిపింది. రైల్వే స్టేషన్లోని రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ బుకింగ్ టైంలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది.
తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి చేస్తూ ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు. జూలై 1, 2025 నుంచి ఈ రూల్స్ అమలు చేశారు. తత్కాల్ బుకింగ్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ ఉంటేనే తత్కాల్ టికెట్ బుకింగ్ అవకాశం కల్పించారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ ద్వారా ఆధార్ అథెంటికేషన్, కేవైసీ చేసిన వారికే తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసే వీలు కల్పించారు. ఇక జూలై 15 తర్వాత తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకునే వారు ఆధార్ ఓటీపీ కూడా ఎంటర్ చేయాల్సి వస్తోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసి సాధారణ కస్టమర్లకు టికెట్లు దక్కేలా చేయడమే ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు కారణంగా రైల్వే విభాగం తెలిపింది. ఐఆర్సీటీసీలోని తమ అకౌంట్తో ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జనరల్ టికెట్ల బుకింగ్ సైతం ఆధార్ అథెంటికేషన్ చేయాల్సి వస్తోంది. తరుచూ రైలు ప్రయాణాలు చేసే వారు టికెట్ బుకింగ్ చేసుకునేందుకు ఇబ్బందులు తొలగుతాయని రైల్వే విభాగం చెబుతోంది. ఆధార్ తప్పనిసరి చేయడంతో అక్రమార్కుల చేతికి టికెట్లు వెళ్లవని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa