మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీకి ముందు భారత జట్టు కీలక సిరీస్ను చేజార్చుకుంది. ఓ దశలో సిరీస్ను 2-1తో కైవసం చేసుకునేలా కనిపించిన భారత్.. చివరక్ 1-2తో వెనకబడి పోయింది. భారత్ వేదికగా జరిగిన 3 మ్యాచుల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా జట్టు 2-1తో కైవసం చేసుకుంది. అయితే మూడో మ్యాచులో ఓడినా.. భారత మహిళల జట్టు మాత్రం గొప్పగా పోరాడింది. ముఖ్యంగా ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు శతకంతో రికార్డులు బద్దలు కొట్టింది.
సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంక సంయుక్త వేదికల్లో మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీకి సన్నాహకంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల సిరీస్లో తలపడ్డాియ. ఇందులో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక రెండో వన్డేలో భారత్.. 102 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. దీంతో మూడో మ్యాచ్పై ఆసక్తినెలకొంది.
ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారీ స్కోరు చేసింది. 47.5 ఓవర్లలో 412 రన్స్ చేసింది. దీంతో బెత్ మూనీ.. 75 బంతుల్లో 138 రన్స్ చేసి.. టాప్ స్కోరర్గా నిలిచింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు.. ఓ దశలో గెలిచేలా కనిపించింది. స్మృతి మంధాన (63 బంతుల్లో 125 రన్స్) వీరోచిత పోరాటంతో..20 ఓవర్లు పూర్తయ్యే సరికి 206/2తో నిలిచింది. క్రీజులో మంధానతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఉండటంతో భారత్.. విజయంపై ధీమాగా ఉంది. కానీ ఈ దశలో ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకున్నారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి.. భారత్ను దెబ్బ తీశారు. దీంతో భారత్.. 47 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌట్ అయింది. మంధానతో పాటు దీప్తి శర్మ (58 బంతుల్లో 72 రన్స్), హర్మన్ ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 52 రన్స్) రాణించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో టీమిండియా ఓడినా మెరుగైన ప్రదర్శన చేసింది. మూడో వన్డేలో ఏకంగా 781 పరుగులు నమోదు కావడం గమనార్హం. సెప్టెంబర్ 30 నుంచి మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa