చాలామంది స్నానం చేసేటప్పుడు సాధారణంగా ముందుగా తలకు నీళ్లు పోసుకుని, ఆ తరువాత శరీరానికి నీళ్లు పోసుకుంటారు.కానీ, ఇది సరైన పద్ధతిగా కాకపోవడం గురించి కెనడా వైద్యుల బృందం చేసిన పరిశోధన తెలియజేస్తోంది.ప్రస్తుతం చేసిన పరిశోధన ప్రకారం, ముందు కాళ్లపై నీళ్లు పోసుకుని, తర్వాత శరీరంపై పోసి, చివరగా తలకు నీళ్లు పోసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మన శరీరంలో ఒక నిర్ధిష్ట ఉష్ణోగ్రత స్థాయిని నిలబెట్టుకోవడాన్ని ముఖ్యంగా గమనించాలి. ముందుగా తలపై నీళ్లు పోసుకోవడం వల్ల అక్కడ రక్తప్రసరణ పెరిగి, రక్తనాళాలు బరువెక్కి స్ట్రోక్లు వచ్చే అవకాశం ఉంటుందని ఈ పరిశోధన చెబుతోంది.ఇది ముఖ్యంగా వయోవృద్ధులు, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, అలాగే గుండె సమస్యలు ఉన్న వారు సాధారణంగా ఈ రకమైన స్ట్రోక్లను ఎదుర్కొంటూ బాత్రూంలో పడిపోయి చనిపోతున్నారు. అందువల్ల, స్నానం చేసే సరైన విధానం పాటించడం కూడా చాలా ముఖ్యం అవుతోంది.
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి
ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కర్నూలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa