దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలలో ఇంజినీరింగ్ కోర్సుల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main 2026) పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ముఖ్యమైన అలర్ట్!నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా కొన్ని కీలక సూచనలతో విద్యార్థులను హెచ్చరిస్తోంది. వచ్చే సంవత్సరం జనవరిలో సెషన్ 1, ఏప్రిల్లో సెషన్ 2 జరగనుంది. సెషన్ 1కి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ నెల నుంచి అందుబాటులోకి వస్తాయని NTA ప్రకటించింది. దరఖాస్తు చేసుకునే ముందు అన్ని అవసరమైన డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.CBSE పది, పన్నెండు తరగతుల పరీక్షల తేదీలు కూడా బయటపడ్డాయి, టెన్త్ పరీక్షలు ఈసారి రెండు సార్లు నిర్వహించనున్నట్టు నిర్ణయించబడ్డాయి.JEE మెయిన్ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడం ముందు, అర్హత కలిగిన విద్యార్థులు తమ డాక్యుమెంట్లను పూర్తి అప్డేట్ చేయించుకోవాలని NTA కోరుతోంది. ఇది దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేసి, తిరస్కరణలు, ఇతర ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది.
-ఆధార్ కార్డు: ఆధార్లో పేరు, పుట్టిన తేదీ (పదో తరగతి సర్టిఫికేట్ ప్రకారం), తాజా ఫోటో, ఇంటి చిరునామా, తండ్రి పేరు అన్ని సరిచూసుకోండి మరియు అవసరమైతే అప్డేట్ చేసుకోండి.
-దివ్యాంగ అభ్యర్థులు: యూడీఐడీ కార్డు వినియోగించవచ్చు. అయితే, అది రెన్యువల్ చేసి, అప్డేట్గా ఉండాలి.
-కేటగిరీ సర్టిఫికెట్లు: EWS/SC/ST/OBC-NCL కేటగిరీ సర్టిఫికెట్లను తప్పకుండా చెల్లుబాటు అయ్యే విధంగా అప్డేట్ చేసుకోండి.అభ్యర్థులు ఎప్పటికప్పుడు www.nta.ac.in మరియు https://jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్లను సందర్శించి తాజా నోటీసులు, అప్డేట్ల గురించి అప్డేట్ అవ్వాలని NTA డైరెక్టర్ (పరీక్షలు) విజ్ఞప్తి చేశారు.ఇలా ప్రాసెస్ సజావుగా సాగేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa