ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలంటున్న జాంటీ రోడ్స్

sports |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 03:09 PM

భారత సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లోనూ ఆడాలని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. వారిద్దరి అపారమైన అనుభవం, మానసిక దృఢత్వం మెగా టోర్నీలో జట్టుకు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నాడు.విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఏడాది ఆరంభంలోనే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ బాధ్యతలను శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారి వన్డే భవిష్యత్తుపై అభిమానులు, క్రీడా విశ్లేషకుల మధ్య చర్చ జరుగుతోంది.ఈ విషయంపై జాంటీ రోడ్స్ స్పందిస్తూ.. "సచిన్, ధోనీల విషయంలోనూ ఇలాంటి చర్చ జరిగింది. ఎప్పుడు రిటైర్ అవ్వాలనేది వాళ్ల ఇష్టం. పరుగులు చేస్తున్నంత కాలం వారిని కచ్చితంగా ఎంపిక చేయాలి. ప్రపంచకప్ లాంటి టోర్నీలలో ప్రతిభతో పాటు మానసిక స్థైర్యం కూడా చాలా ముఖ్యం. ఆ రెండూ కోహ్లీ, రోహిత్‌లలో పుష్కలంగా ఉన్నాయి" అని అన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa