సాధారణంగా మన దేశంలో వీఐపీల ఇంట వివాహం అంటే సినీ, రాజకీయ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కామన్. కానీ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు ఇండియాలో జరిగే వేడుకకు హాజరు కావాలంటే.. అది అంబానీ ఇంట జరిగే వేడుక అయి ఉండాలనే అభిప్రాయం జనాల్లో నెలకొని ఉంది. ముకేష్ అంబానీ ముగ్గురు బిడ్డల పెళ్లికి మన దేశం నుంచి మాత్రమే కాక ప్రపంచ దేశాల నుంచి అందునా అగ్రరాజ్యం అమెరికా నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా అతిథిలుగా హాజరయ్యారు. తాజాగా మరోసారి అమెరికా అధ్యక్షుడి కుటుంబ సభ్యులు.. ఇండియాలో జరిగే ఓ వివాహ వేడుకకు ప్రత్యేక అతిథిలుగా తరలి వచ్చారు. అయితే ఈ వేడుక జరిగింది మాత్రం అంబానీ ఇంట కాదు. ఆ వివరాలు..
లేక్ సిటీ, ప్రశాంతతకు కేరాఫ్ అడ్రెస్గా నిలిచే ఉదయపూర్ వివాహాది శుభకార్యాలకు హాట్స్పాట్గా మారింది. దేశంలోని చాలా మంది సెలబ్రిటీలు.. ఉదయపూర్లో వివాహం చేసుకున్నారు. ఈ నగరం ఇప్పుడు మరో గొప్ప లగ్జరీ వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన వివాహం ఉదయపూర్లో జరుగుతుంది. రాజస్తాన్ నడిబొడ్డున జరిగే ఈ వివాహ వేడుకకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ హాజరవుతుండటం విశేషం.
నేత్ర మంతెన వివాహం.. అమెరికాకు చెందిన వంశీ గదిరాజుతో జరుగుతుంది. నవంబర్ 21, 22 తేదీల్లో ఉదయపూర్లో ఘనంగా వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వివాహ వేడుకకు హాలీవుడ్ సినీ, రాజకీయ సెలబ్రిటీలు కూడా హాజరవుతారని తెలుస్తోంది. దాదాపు 40 దేశాల నుంచి 126 మంది ప్రత్యేక అతిథిలు ఈ వివాహ వేడుకకు హాజరవుతారని సమాచారం. దీంతో ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
అమెరికాలో బిలయనీర్, ఫార్మాస్యూటికల్ సీఈఓ అయిన రామరాజు మంతెన కూతురు నేత్ర మంతెన పెళ్లి, వంశీ గదిరాజుతో అంగరంగ వైభవంగా జరగనుంది. వీరి వివాహానికి జెన్నిఫర్ లోపేజ్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, స్టిన్ బీబర్లు హాజరవుతారని తెలుస్తోంది. సిన్ బీబర్లతో పవర్హౌస్ షోస్ నిర్వహిస్తారని తెలుస్తోంది. అలానే మన దేశానికి చెందిన పలువురు సినీ, పొలిటికల్ సెలబ్రిటీలు ఈ వివాహ వేడుకకు హాజరవుతున్నారు. ఐకానిక్ ప్యాలెస్లలో ఈ వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వివాహానికి బాలీవుడ్ నుంచి మాధురి దీక్షిత్, హృతిక్ రోషన్, రణవీర్ సింగ్, జాన్వీ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి, దియా మీర్జా, షాహిద్ కపూర్వరుణ్ ధావన్, కృతి సనన్ వంటి తారలు హాజరు కాబోతున్నారు.
రామరాజు మంతెన.. భారత సంతతికి చెందిన వ్యక్తి. అమెరికాలో ఉన్న ఇంజెనస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఛైర్మన్, సీఈవో. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. ఇంటర్నేషనల్ ఆంకాలజీ నెట్వర్క్ (ION), ICORE హెల్త్కేర్,ఆన్కోస్క్రిప్ట్ల వ్యవస్థాపకుడిగా అమెరికా ఆరోగ్య సంరక్షణ రంగంలో రాజు మంతెనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa