ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యలన్ని పరిష్కారం,,,,ఆ 29 గ్రామాలకు రూ.904 కోట్లు విడుద

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 08:48 PM

ఆంధప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. అమరావతి నిర్మాణం, అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. ఈక్రమంలో అమరావతి నిర్మాణంలో భాగంగా ఉన్న రాజధాని గ్రామాలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకరకంగా చెప్పాలంటే ఆయా గ్రామాలకు మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. ఈ గ్రామాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.904 కోట్లు విడుదల చేసింది. వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఆయా గ్రామాల్లో అభివృద్ధి ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.


ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ఉన్న.. 29 రాజధాని గ్రామాలకు త్వరలోనే మహర్దశ పట్టనుంది. ఈ గ్రామాల పరిధిలో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గాను కూటమి ప్రభుత్వం రూ.904 కోట్లు కేటాయించింది. రాజధాని అమరావతి మాత్రమే కాక.. దీనితో పాటు.. రాజధాని గ్రామాల్లోకూడా ఆధునిక వసతులు కల్పించాలని భావించిన ప్రభుత్వం.. అందుకు అవసరమైన నిధులు, పలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిధులు విడుదల కావడంతో.. 2026, జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని ఏడీసీఎల్‌ అధికారులు తెలిపారు.


వసతులు కల్పన కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిచండంతో.. అనేక సమస్యలు తీరుతాయని ఆయా గ్రామాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. తాజాగా విడుదల చేసిన నిధుల నుంచి.. రాజధాని గ్రామాలకు.. కృష్ణానది నుంచి ఫిల్టర్‌ చేసిన తాగు నీటిని సరఫరా చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. దీనివల్ల నేలపాడు, శాఖమూరు, ఐనవోలు, మందడం, నెక్కల్లు, అనంతవరం వంటి గ్రామాల్లో తాగు నీటి కష్టాలు తీరిపోతాయి అంటున్నారు అధికారులు. వీటితో పాటుగా హరిశ్చంద్రపురంలో రక్షిత తాగు నీటి పథకాన్ని ప్రారంభించబోతున్నారు.


అనంతవరం, బోరుపాలెం, ఐనవోలు, వెంకటపాలెం, నెక్కల్లు, రాయపూడి వంటి గ్రామాల్లో తరచుగా ముంపు సమస్యల తలెత్తుంది. దీని పరిష్కారం కోసం డ్రెయిన్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం లభించనుందని భావిస్తున్నారు. అలానే తుళ్లూరు మండలంలని గ్రామాల్లో ముగురు నీటిని శద్ధి చేసి.. దాన్ని అమరావతిలోని రోడ్ల వెంట నిర్మిస్తున్న మురుగు నీటి వ్యవస్థకు అనుసంధానం చేయనున్నారు. అలానే పలు రాజధాని గ్రామాల్లో సీసీ రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. 2014-19 మధ్య కాలంలో కొన్నిప్రాంతాల్లో మాత్రమే సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిని మినహాయించి మిగతా చోట్ల సీసీ రోడ్లు నిర్మిస్తారు. అలానే రాజధాని గ్రామాల్లో భూగర్భ మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.


ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో తాగునీటికి గాను రూ.64.35 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆ తర్వాత రోడ్ల కోసం రూ.339.04 కోట్లు.. మురుగుశుద్ధి ప్లాంట్ల కోసం రూ.110.72 కోట్లు, వీధి దీపాల కోసం రూ.12.25 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఏడేళ్ల పాటు ఈ ప్రాజెక్టుల నిర్వహణతో కలుపుకుని ప్రభుత్వం రూ.904 కోట్లు ఖర్చు చేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa