ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..తాత్కాలిక కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్

sports |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 08:53 PM

దక్షిణాఫ్రికాతో నవంబర్ 30 నుంచి జరగనున్న 3 వన్డేల సిరీస్‌ కోసం భారత సెలక్షన్ కమిటీ.. ఆదివారం జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయాలతో దూరం కావడంతో కేఎల్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. దీంతో రెండేళ్ల తర్వాత రాహుల్.. తిరిగి భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో పోలిస్తే.. ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో పలు మార్పులు చేసింది బీసీసీఐ.


ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన.. తిలక్ వర్మ, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్‌ను సౌతాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక చేసింది. అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్‌లను జట్టు నుంచి తప్పించింది. పంత్ జట్టులోకి వచ్చినప్పటికీ ధ్రువ్ జురెల్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు స్పిన్నర్‌ కోటాలో చోటు దక్కించుకున్న అక్షర్ పటేల్.. రవీంద్ర జడేజా రీఎంట్రీతో జట్టులో చోటు కోల్పోయాడు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌ల స్థానంలో తిలక్ వర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌లు ఎంపికయ్యారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. ఈ సిరీస్ ద్వారా జైశ్వాల్.. వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో నితీశ్ కుమార్ రెడ్డికి స్థానం దక్కింది.


దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు భారత జట్టు:


రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్‌ కీపర్), రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.


భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ షెడ్యూల్..


తొలి వన్డే: నవంబర్ 30 - రాంచీ


రెండో వన్డే: డిసెంబర్ 03 - రాయ్‌పూర్


మూడో వన్డే: డిసెంబర్ 06 - విశాఖపట్నం







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa