మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు(25వ తేదీ) నుంచి మూడు రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నవంబర్ 25 నుంచి 27 వరకు ఆయన నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 25-11-2025 అనగా రేపు సాయంత్రం 4 గంటలకు వైయస్ జగన్ పులివెందుల చేరుకుంటారు. క్యాంప్ ఆఫీసుకు వెళ్లి రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. ప్రజల నుంచి పలు సమస్యలు, వినతులను స్వీకరిస్తారు. అనంతరం పులివెందులలోని తన నివాసంలో రాత్రి బస చేస్తారు. 26-11-2025 ఉదయం 9 గంటలకు పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే వివాహానికి వైయస్ జగన్ హాజరవుతారు.తదుపరి బ్రహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి, అరటి రైతులతో అక్కడే మాట్లాడతారు. రైతుల సమస్యలు, ప్రస్తుత పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.ఆ తర్వాత పులివెందులకు తిరిగి వచ్చి లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.మధ్యాహ్నం వేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళ్లి ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు.సాయంత్రం పులివెందుల క్యాంప్ ఆఫీసుకు చేరుకుని మరోసారి రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి పులివెందుల నివాసంలోనే బస చేస్తారు. 27-11-2025 ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి తిరుగు పయనం కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa