ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై 24 గంటల్లో ధాన్యం కొనుగోలు సొమ్ము చెల్లింపులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 02:01 PM

రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం తాలూకా సొమ్ముని 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో జమ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. చెల్లింపుల్లో ఏ మాత్రం జాప్యం జరిగినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణపై రాజమండ్రి కలెక్టరేట్‌లో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రైతులను ఇబ్బంది పెట్టే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa