ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులో హత్యకి గురైన అన్నమయ్య జిల్లా విద్యార్థిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 02:04 PM

బెంగళూరులో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం, బిక్కంగారిపల్లికి చెందిన దేవశ్రీ (21) అనే విద్యార్థినిని నిందితుడు అత్యంత కిరాత‌కంగా చంపేశాడు. ఉన్నత చదువులతో ఉజ్వల భవిష్యత్తును ఊహించుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.వివరాల్లోకి వెళితే.. రెడ్డెప్ప, జ‌గ‌దాంబ దంప‌తుల కుమార్తె అయిన దేవశ్రీ బెంగళూరులోని ఆచార్య కళాశాలలో బీబీఏ నాలుగో సంవత్సరం చదువుతోంది. చదువు నిమిత్తం అక్కడే ఓ అద్దె గదిలో నివసిస్తోంది. ఆమెకు సన్నిహితుడైన చిత్తూరు జిల్లా చౌడేపల్లికి చెందిన ప్రేమ్ వర్ధన్ అనే యువకుడు ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.దేవశ్రీ తలపై బలంగా మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. మదనాయ‌నకహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ప్రేమ్ వర్ధన్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. చదువు పూర్తి చేసుకుని పట్టాతో ఇంటికి వస్తుందనుకున్న కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa