మానవ కార్యకలాపాల వల్ల వాతావరణ మార్పు తీవ్రతరమైందని, 2025 అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా నిలిచిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికీకరణకు ముందు కాలంతో పోలిస్తే, 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పరిమితిని మూడేళ్ల సగటు ఉష్ణోగ్రత అధిగమించడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ సంఘటనలు వేలాది మందిని బలిగొంటున్నాయి, బిలియన్ల డాలర్ల నష్టాన్ని కలిగిస్తున్నాయి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించకపోతే భూగ్రహం మరింత వేడెక్కడం ఖాయమని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సహ వ్యవస్థాపకురాలు ఫ్రెడెరిక్ ఒట్టో హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa