ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం మొత్తం విలువ దేశ ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) పరిమాణాన్ని మించిపోయింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,500 డాలర్లు దాటడంతో ఈ పరిస్థితి నెలకొంది. మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం.. భారతీయ ఇళ్లలో దాదాపు 34,600 టన్నుల బంగారం నిల్వ ఉంది.ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం లెక్కగడితే.. భారతీయుల వద్ద ఉన్న ఈ బంగారం విలువ 5 లక్షల కోట్ల డాలర్ల కంటే ఎక్కువ. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనాల ప్రకారం భారత జీడీపీ సుమారు 4.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అంటే దేశం మొత్తం ఉత్పత్తి చేసే ఆదాయం కంటే ప్రజల ఇళ్లలో ఉన్న పసిడి విలువే ఎక్కువగా ఉండటం గమనార్హం.ఈ అంశంపై ఇన్ఫోమెరిక్స్ వాల్యుయేషన్ అండ్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ డాక్టర్ మనోరంజన్ శర్మ మాట్లాడుతూ.. "జీడీపీ అనేది ఒక ప్రవాహం లాంటిది, బంగారం అనేది నిల్వ ఉండే ఆస్తి. ఈ రెండింటిని నేరుగా పోల్చలేం. కానీ, భారత ఆర్థిక వ్యవస్థలో బంగారానికి ఉన్న సామాజిక, ఆర్థిక, మానసిక ప్రాధాన్యతను ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి" అని విశ్లేషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa