అయోధ్యలోని రామ మందిర సముదాయంలో ఓ వ్యక్తి నమాజ్ చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. అతడిని భద్రతా సిబ్బంది అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాకు చెందిన అహ్మద్ షేక్గా గుర్తించారు. 55 ఏళ్ల ఆ వ్యక్తి శుక్రవారం (డిసెంబర్ 9) అత్యంత భద్రత ఉండే ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడని.. దర్శనం చేసుకున్న తర్వాత సీతా రసోయి ప్రాంతం సమీపంలో కూర్చుని నమాజ్ చేయడానికి ప్రయత్నించాడని అధికారులు వెల్లడించారు.
అహ్మద్ షేక్ నమాజ్ చేయడానికి ప్రయత్నిండగా.. అతడి చేష్టలను గమనించిన ఆలయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అనంతరం విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. అయితే అహ్మద్ షేక్ ఏ ఉద్దేశంతో ఆలయానికి వచ్చాడు, అతడి తెలుసుకోవడానికి దర్యాప్తు, నిఘా సంస్థలు అతడిని విచారిస్తున్నాయని పోలీసులు తెలిపారు. అతడు అయోధ్యకు ఎందుకు వచ్చాడు, ఈ ఘటనలో ఇంకెవరి హస్తం ఉంది అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, ప్రాథమిక తనిఖీల్లో అతడి వద్ద జీడిపప్పు, ఎండుద్రాక్ష వంటి వస్తువులను పోలీసులు గుర్తించారు. క విచారణ సందర్భంగా తాను అజ్మీర్ వెళ్తున్నట్లు అహ్మద్ షేక్ పోలీసులకు చెప్పాడు. ఈ ఘటనతో అయోధ్య రామ మందిర పోలీసులు అలర్ట్ అయ్యారు. సీనియర్ పోలీస్ అధికారులు, నిఘా అధికారులు రామ మందిర సముదాయంలోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
మరోవైపు, అహ్మద్ షేక్కు మతిస్థిమితం సరిగా లేదని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనగర్ మెడికల్ కాలేజీలోని సైకియాట్రీ విభాగంలో అతడికి చికిత్స అందించిన వైద్య రికార్డులను చూపించారు. అతడు అయోధ్య వెళ్లినట్లు తమకు అస్సలు తెలియదని అతడి కొడుకు ఇమ్రాన్ తెలిపాడు. తన తండ్రి ఇంట్లో ఎక్కువగా ఉండడని.. ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతాడని చెప్పాడు. అయితే గత కొంత కాలంగా అహ్మద్ షేక్కు చికిత్స జరుగుతోందని అతడి ఇంటి సమీపంలో ఉండే వారు చెప్పారు.
వచ్చే వారం జరిగే మకర సంక్రాంతి వేడుకలు, జనవరి 22న రామ మందిర ప్రాణప్రతిష్ట రెండో వార్షికోత్సవానికి అయోధ్య సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరిగడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనాలు ఉండటంతో.. అయోధ్య రామమందిర సముదాయంతో పాటు, అయోధ్య అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa