ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల భూ హక్కులకు కొత్త పాస్‌బుక్ లు పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 02, 2026, 03:27 PM

కౌతాళం మండలం అగసలదిన్నె గ్రామంలో రైతుల భూ హక్కులను పరిరక్షించేందుకు టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు కొత్త పాస్‌బుక్ పంపిణీ కార్యక్రమం జరిగింది. సోమవారం జిల్లా ఉపాధ్యక్షుడు చూడి ఉలిగయ్య, తహసీల్దార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం భూ వివాదాలను పరిష్కరించి, రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని, గత ప్రభుత్వంలో జగన్ ఫోటోతో పాస్‌బుక్ ముద్రించడం రైతుల ఆస్తిని కాజేసే ప్రయత్నమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa