బిర్యానీ అనగానే ఘుమఘుమలాడే ఆ సువాసనతో పాటు ప్లేట్ పక్కన ఉండే పచ్చి ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ గుర్తుకు వస్తాయి. బిర్యానీ ముద్దతో కలిపి కరకరలాడే ఉల్లిపాయను తింటే ఆ రుచే వేరు. అందుకే చాలామంది ఉల్లిపాయ లేకుండా ముద్ద కూడా దిగదని చెబుతుంటారు. అయితే, రుచి కోసం మనం ఇష్టపడే ఈ పచ్చి ఉల్లిపాయల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యానికి ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పచ్చి ఉల్లిపాయలను సరిగ్గా శుభ్రం చేయకుండా నేరుగా తింటే జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. వీటిపై ఉండే బ్యాక్టీరియా వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం మరియు విపరీతమైన కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, అపరిశుభ్రమైన ఆహారపు అలవాట్ల వల్ల కాలేయానికి సంబంధించిన సిస్టిక్ సిర్రోసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. కాబట్టి ఉల్లిపాయలను కోసే ముందు తప్పనిసరిగా శుభ్రమైన నీటితో కడగాలి.
కేవలం జీర్ణ సమస్యలే కాకుండా, పచ్చి ఉల్లిపాయల వల్ల గుండెల్లో మంట (Heartburn) మరియు నోటి దుర్వాసన వంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు తిన్న తర్వాత నోటిలో ఒక రకమైన ఘాటైన వాసనను కలిగిస్తాయి, ఇది ఇతరులతో మాట్లాడేటప్పుడు అసౌకర్యంగా మారుతుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో ఎసిడిటీ పెరిగి నిద్రకు కూడా భంగం కలిగే అవకాశం ఉంటుంది.
అయితే ఉల్లిపాయలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. కాబట్టి వీటిని పరిమితంగా, శుభ్రంగా కడిగి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఏదైనా అతిగా తింటే ప్రమాదకరం కాబట్టి, బిర్యానీతో పాటు ఉల్లిపాయను మితంగా తీసుకుంటేనే అది అమృతంలా పనిచేస్తుందని గుర్తించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa