ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం ప్రచురణపై స్పందించిన ఎంఎం నరవణె

national |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 02:12 PM

తన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం ప్రచురణపై భారత సైన్యం మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె మౌనం వీడారు. తన పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. నా పుస్తక ప్రచురణ ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉందంటూ ఆయన 'ఎక్స్' వేదికగా 'పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా' చేసిన పోస్టును పేర్కొన్నారు.ఈ పుస్తకం కాపీలు ఇంకా ప్రింట్ కాలేదని, డిజిటల్ రూపంలో కూడా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని, కాబట్టి ఈ కాపీలు ఎవరికీ ఇవ్వలేదని, విక్రయించలేదని ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా పోస్టు చేసింది. దీనిని ఆయన రీపోస్టు చేస్తూ పైవిధంగా స్పందించారు. ఈ పుస్తకం ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదని పెంగ్విన్ ప్రకటన చేసింది.నరవణే రాసిన పుస్తకంపై పార్లమెంటులో దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. చైనా భారత భూభాగంలోకి వచ్చిందని ఈ పుస్తకం వెల్లడిస్తోందని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa