ఆకాశంలో రేపు అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. మంగళవారం సంభవించే సూర్య గ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్గా కనువిందు చేయనుంది. అయితే ఈ సూర్యగ్రహణం గురించి పండితులు కీలక విషయాలు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం గురించి గర్భిణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎప్పటిలాగే తమ పనులు చేసుకోవడం, ఆహారం తీసుకోవడం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని, కాబట్టి ఇక్కడ ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన పనిలేదని సూచిస్తున్నారు.అయితే భారత దేశంలో ఈ సూర్య గ్రహణం కనిపిస్తుందా? ఫిబ్రవరి 17న ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గున అమావాస్య రోజున గ్రహణం ఏర్పడనుంది. దాదాపు ఇది రెండు నిమిషాల 20 సెకన్ల పాటు ఉంటుంది. యూటీసీ నివేదిక ప్రకారం.. ఉదయం 7 : 01 గంటలకు ప్రారంభం, అంటే భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 : 31 గంటలకు ఇది ఏర్పడుతుంది.ఈ సూర్య గ్రహణం అగ్నివలయం ఆకారంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గ్రహణం ఎక్కువగా అంటార్కిటికాలో కనిస్తుంది. తర్వాత దక్షిణ ఆఫ్రికా, చిలీ, అర్జెంటీనాలో కనిపిస్తుంది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు. చాలా మంది అగ్ని వలయ సూర్య గ్రహణాన్ని చూడాలని అనుకుంటే మాత్రం వారికి నిరాశే అని చెప్పాలి. ఈ గ్రహణం వార్షిక దశ భారత్లో కనిపించదు, కొన్ని ప్రాంతాలలో మాత్రం పాక్షిక సూర్య గ్రహణాన్ని చూడ వచ్చును.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa