ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు చర్యలు చేపడుతున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 17, 2026, 03:50 PM

 2019-24 గత ప్రభుత్వ సమయంలో జీవో 117 తీసుకురావడంతో పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని, ఈ క్రమంలో ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజాప్రభుత్వం వచ్చాక ఆ జీవోను రద్దు చేశామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ, గత ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.అంతేకాకుండా పాఠశాల విద్యాభివృద్ధిలో వన్ క్లాస్ - వన్ టీచర్ విధానం చాలా కీలకమైందని, గతంలో 3 శాతం పాఠశాలల్లో మాత్రమే వన్ క్లాస్ - వన్ టీచర్ ఉంటే, ఇప్పుడు 33 శాతానికి పెంచామని అన్నారు. దీనిద్వారా పిల్లలకు మెరుగైన విద్య అందడంతో పరీక్షల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రధానంగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు.ప్రధానంగా లీక్ ప్రూఫ్ బిల్డింగ్, పెయింట్స్, బెంచీలు, టాయ్ లెట్స్, తాగునీరు అందించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇచ్చామని, ఏపీలో 5 స్టార్ రేటింగ్ ఉన్నవి లేవని వెల్లడించారు. 40 శాతం 1, 2లో స్టార్‌లో ఉన్నాయని, అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 3, 4 స్టార్ రేటింగ్ కు తేవాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. పెండింగ్ వర్క్స్ పూర్తిచేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఎక్కడ తరగతి గదుల అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని నిర్ణయించామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa