భారత జనాభా పెరుగుదలకు గల కారణాలను, దాని ఆర్థిక ప్రభావాలను నిపుణులు వివరించారు. అధిక మరణరేటు, తక్కువ జననరేటు, వ్యవసాయ ప్రాబల్యం, పేదరికం, బాల్య వివాహాలు, నిరక్షరాస్యత వంటివి జనాభా పెరుగుదలకు కారణాలుగా పేర్కొన్నారు. జనాభా పెరుగుదల ఆర్థికాభివృద్ధికి ఆటంకమని కొందరు, దోహదపడుతుందని మరికొందరు వాదిస్తున్నారు. పారిశ్రామిక రంగ విస్తరణ, ఆదాయ సమపంపిణీ, ఉపాధి అవకాశాల కల్పన, అక్షరాస్యత పెంపు, కుటుంబ నియంత్రణ వంటి చర్యల ద్వారా జనాభా పెరుగుదలను నియంత్రించవచ్చని సూచించారు.జనాభా పెరిగే కొద్దీ భూమిపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా భూమి మానవ నిష్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 1951 జనాభా లెక్కల్లో మన దేశంలో జనసాంద్రత 117 కాగా, 2011 నాటికి 382కు పెరిగింది. చదరపు కిలోమీటర్కు నివసించే జనాభా పెరగడం వల్ల తలసరి ఒక్కొక్కరికి వచ్చే భూమి తగ్గుతుంది. కమతాలు విభజనకు లోనవుతాయి. ఫలితంగా ఉత్పాదకత తగ్గుతుంది. కాబట్టి జనాభా వృద్ధి పెరగడం ఆర్థికాభివృద్ధికి ఆటంకమవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa