ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడ ఘటన దురదృష్టకరమన్న ప్రధాని మోదీ బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 08:52 PM

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడు ఘటనలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు.ఈ మేరకు ప్రధాని మోదీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.కాకినాడ జిల్లాలోని బాణసంచా కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయాన్ని కూడా ప్రధాని ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రధాని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa