ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 20, 2022, 08:58 PM

ఏపీ ప్రభుత్వం మున్నూరు కాపులను బీసీగా గుర్తించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్నూరు కాపులను బీసీ-డీ జాబితాలో చేర్చిన ఏపీ ప్రభుత్వం... ఆ మేరకు ఇక నుంచి మున్నూరు కాపులకు బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వనుంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలుగా గుర్తించిన రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనమైన 7 మండలాల్లో మున్నూరు కాపుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన మున్నూరు కాపు సామాజికవర్గం తమను బీసీలుగా గుర్తించాలని కోరారు.దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa