కడప జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రత్యేకంగా కలసి స్వాగతం పలికారు. కడప జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని శనివారం కడప ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గం వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa