మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాలుగా కష్టనష్టాలు అనుభవిస్తున్నారు అని పల్నాడు జిల్లా, నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు.స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని,ఎన్టీఆర్ చిత్రపటానికి పూల దండలు వేసి నివాళులర్పించారు. టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ... వైసీపీ ప్రభుత్వ హయాంలో పెరిగిన నిత్యావసర, ఇతర వస్తువుల ధరలను, అన్ని వర్గాలకు జరిగిన అన్యాయాలను, వైసీపీ నేతలు సాగించిన అక్రమాలు, దోపిడీల గురించి ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అయన మాట్లాడుతూ... రాష్ట్రంలో కేవలం ఒక సామాజికవర్గమే లబ్ధి పొందింది. అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు. వైసీపీ నాయకులు బరితెగించి అడ్డగోలుగా ఇసుక, మట్టి, కొండలు,కోనలు దోచుకున్నారు. రానున్న ఎన్నిక టీడీపీకే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని ఆశాభావం వ్యక్తపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa