జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి రానున్న నేపథ్యంలో , మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కు జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు కార్యకర్తలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. ఎప్పుడూ లేని విధంగా పార్టీ కార్యాలయంలో మూడు ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. బయట నుంచి కూడా అధ్యక్షులు ఉపన్యాసం చూసేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. విశాఖ ఘటన దృష్టిలో ఉంచుకొని జనసేన కార్యాలయం గేటు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa