వికేంద్రీకరణకు మద్దతుగా, అమరావతి యాత్రకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాజమండ్రివాసులుపై దాడికి తెగబడిన అమరావతి పాదయాత్రికులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై దారుణంగా వ్యవహరించారని, రాళ్లు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారని, వాటర్ బాటిళ్లలో మురికినీరు నింపుకొని వచ్చి మరీ తమపై విసురుతున్నారని ఎంపీ భరత్ మండిపడ్డారు. ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు, దత్తపుత్రుడు బేషరతుగా రాజమండ్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేనకు ప్రజలు బుద్ధిచెప్పాలని కోరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రీప్లాన్డ్గా రాళ్లు, వాటర్ బాటిళ్లు తెచ్చుకొని తమపై, పోలీసులపై విసురుతున్నారని ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa