గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, వంశీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు దాఖలు చేసిన పిటిషన్లో ఈ నోటీసులు జారీ అయ్యాయి. 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంశీ పోటీ చేసారు. వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకటరావు పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన వంశీ కొంతకాలం క్రితం టీడీపీకి దూరమై వైసీపీలో చేరారు. అయితే రెండేళ్ల క్రితం వంశీ ఎన్నికను రద్దు చేయాలని వెంకటరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. రెండేళ్ల క్రితం పిటిషన్ దాఖలు చేసినా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయలేదని వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని కోరారు. 2019 ఎన్నికల్లో భాగంగా ప్రసాదంపాడులో వంశీ అనాచార్యులు రిగ్గింగ్కు పాల్పడ్డారని పోలీసులు కూడా కేసు నమోదు చేశారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. వెంకటరావు వాదనలు విన్న కోర్టు వంశీతో పాటు గన్నవరం రిటర్నింగ్ అధికారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa