సూర్యగ్రహణం కారణంగా అక్టోబరు 25వతేదీ ఉదయం 8నుండి రాత్రి 7వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. అక్టోబరు 25న సాయంత్రం 5. 11 గంటల నుండి 6. 27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. అనంతరం ఆలయ తలుపులు తెరిచి, శుద్ధి, పుణ్యహవచనం, కైంకర్యాలు చేపడతారు.
అదేవిధంగా నవంబరు 8న మధ్యాహ్నం 2. 39 గంటల నుండి సాయంత్రం 6. 27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8 నుండి రాత్రి 7 గంటలకు అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్ దర్శనాలతోపాటు అన్ని ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. భక్తులు ఈ విషయాలను గమనించగలరని కోరడమైనది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa