ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా వైసీపీని ప్రజలు ఓడిస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. పల్నాడు జిల్లాలో వరద ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..... భారీ వర్షాలకు మిరప, పత్తిపంట దెబ్బతిన్నదని తెలిపారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం జగన్ సర్కార్కు లేదని తప్పుబట్టారు. వరద ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, అధికారులు పర్యటించలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం పట్ల ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగానే జనసేన అధినేత పవన్ కు సంఘీభావం తెలిపానని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa