మైదుకూరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్, కో-కన్వీనర్ లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా మైదుకూరు నియోజకవర్గ కన్వీనర్ గా గూడూరు మహమ్మద్ దస్తగిరి ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఈయన రెండవసారి ఎన్నిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నాపై నమ్మకం ఉంచి రెండవ మారో ఈ పదవి బాధ్యతలు అప్పగించిన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి,
మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డికి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్లకు, మైదుకూరు నియోజకవర్గం లోని నాయకులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa