అధికారులు ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పక్కాగా ముందుకు తీసుకెళ్ళే విధంగా, లక్ష్యాన్ని చేరుకొనే విధంగా శ్రద్ధ పెట్టి పనిచేయాలని సబ్ కలెక్టర్ గీతాంజలి ఆదేశించారు. పొన్నూరు తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తొలుత జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆమె పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సూచించిన విధంగా కిందిస్థాయి అధికారులు నడుచుకోవాలన్నారు. ప్రతి అంశంలో పురోగతి ఉండాలన్నారు. ఇంటి నిర్మాణాలు, నాడు నేడు పనులు, గడప గడపకు కార్యక్రమం, ఇతర పథకాలకు సంబంధించిన అంశాలపై ఆమె సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎస్. శ్రీకాంత్ కేదార్నాధ్, మండల విద్యాశాఖాధికారి రుద్రపాటి శోభాచంద్, సిడిపిఓ ఎస్. వెంకటరమణ, గృహనిర్మాణశాఖ డిఇ కోటేశ్వరరావు, ఈఓపిఆర్డీ పూషడపు శివ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa