జగనన్న పాలనలో సంక్షేమ విప్లవం కొనసాగుతోందని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాయచోటి మున్సిపాలిటీలోని 8 వ వార్డు 5 వ సచివాలయ పరిధిలోని ముహమ్మద్ పురా స్ట్రీట్, జామియా మసీదు స్ట్రీట్, ట్రంక్ రోడ్డు, షిఫా ఆసుపత్రి వెనుక వీధులు, అబ్దుల్లా ఫ్యాక్టరీ వీధి, పిండి మునాఫ్ వీధి లలోగడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి గడప కూ శ్రీకాంత్ రెడ్డి వెళ్లి ప్రజా సమస్యలు ఆరా తీయడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈసందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మరింత మెరుగైన పాలన సాగించేందుకు, ప్రజా సనస్యలును తెలుసుకుని వాటి సత్వర పరిష్కారా నికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ మూడేళ్ళ కాలంలో తొంభై ఎనిమిది శాతానికి పైగా నెరవేర్చారన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా, చెప్పిన సమయానికి ముందుగానే సంక్షేమ ఫలాలను అందిస్తున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa