జనాబ్ మౌలాన అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీన గుంటూరు నగరంలో నిర్వహించనున్న జాతీయ విద్య దినోత్సవ వేడుకలకు వేదిక ఖరారైంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కానుండటంతో సోమవారం మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మేయర్ కావటి మనోహర్నాయుడు, నగర కమిషనర్ కీర్తి చేకూరి విజ్ఞాన మందిరాన్ని పరిశీలించారు. కార్యక్రమం నిర్వహణకు అనువుగా ఉంటుందని నిర్ణయించి ఖరారు చేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్లు బాలవజ్రబాబు, సజిల, ఆర్డీవో ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa