ములకల చెరువు ఎస్ఈబీ స్టేషన పరిధిలో గురువారం మదనపల్లె, విజయవా డ, కడప స్పెషల్ టీంల తో కలిసి విస్తృత దాడు లు నిర్వహించి 288 కర్ణా టక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ మల్లిక తెలిపారు. ఈ దాడుల్లో రెండు ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. పెద్దతిప్పసముద్రం మండలం బూర్లపల్లె సమీపంలో దాడులు నిర్వహించి కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు నిందితులు నరసింహులు(43), శ్రీనివాసు లు(29)లను అరెస్టు చేసి వారి నుంచి 96 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీ నం చేసుకుని ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశామన్నారు. అలాగే తనకల్లు మండలం బీమ్లానాయక్తాండాకు చెందిన మోహననా యక్(40)ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 192 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశామన్నారు. అలాగే పెద్దమండ్యం మండలం వడ్డివంకతాండా సమీపంలో దాడులు నిర్వహించి 500 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa