తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ అధ్యక్షుడు కాశిభట్ల సాయినాధ్ శర్మ కలిశారు. బుధవారం మధ్యాహ్నం నారా లోకేష్ పిలుపు మేరకు ఉండవల్లిలోని లోకేష్ స్వగృహంకు వెళ్లి కాశిభట్ల సాయినాధ్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా సాయినాథ్ శర్మ నారా లోకేష్ ను సన్మానించారు. సుమారు 40నిమిషాల పాటు కమలాపురం నియోజకవర్గంపై, కడప జిల్లాలో పార్టీ పరిస్థితుల పలు అంశాల పై సుదీర్గంగా చర్చించినట్లు సాయినాధ్ శర్మ తెలిపారు.
టిడిపి రాష్ట్ర కార్యదర్శి కుసుమకుమారి, మాజీ కార్పొరేటర్ గండూరి మహేష్, కేశినేని కార్యాలయ కార్యదర్శి శివ శర్మ, రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రెంట్ రాష్ట్ర నాయకులు పొన్నలూరి కిరణ్ కుమార్, శశిభూషన్, కడప పార్లమెంట్ టిడిపి మీడియా కో -ఆర్డినేటర్ జనార్దన్, రైతు సంగం నాయకుడు జనార్దన్ రెడ్డి, లెటపల్లె సుబ్బారెడ్డి, గుండం వెంకటేష్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa