ఆమదాలవలస మండలంలోని భైరిశాస్త్రులపేట గ్రామానికి చెందిన మంజు అనే దళిత మహిళపై దాడి చేసి కులంపేరుతో దూషించిన గాజులకొల్లివలస సర్పంచ్ ఎం.కూర్మారావుతోపాటు భైరిశాస్త్రులపేటకు చెందిన లంక ఆదినారాయణ, వార్డు వలంటీర్ లంక పవన్కల్యాణ్, రామరాజు, లంక శారదను పోలీసులు తక్షణమే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. దళిత మహిళపై దాడిచేసిన వారిని ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. డీఎస్పీ విచారణ చేపట్టి వారం రోజులు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా వారిని అరెస్టు చేయాలని, లేదంటే జిల్లా కేంద్రంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దళిత సంఘాల నాయకులు వి.లక్ష్మీనారాయణ, బొనెల అప్పారావు, డి.గణేష్, బి.ప్రభాకర్, లోపింటి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa