ఏపీ సీఎం జగన్ ఈ నెల 28న రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారం, 2020-21 రబీ, 2021 ఖరీఫ్ కు సంబంధించి సున్నా వడ్డీ జమ చేయనున్నారు. 2022-23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 45,998 రైతుల ఖాతాల్లో రూ.39.39 కోట్లు జమ చేయనున్నారు. 2020-21 రబీ సీజన్ కు సంబంధించి 2.54 లక్షల మందికి 45.22 కోట్లు, 2021 ఖరీఫ్ కు సంబంధించి 5.68 లక్షల మందికి రూ.115.33 కోట్ల చొప్పున మొత్తం 8.22 లక్షల మందికి రూ.160.55 కోట్లు సున్నా వడ్డీ జమ చేయనున్నారు. సున్నా వడ్డీ, పంట నష్టపరిహారం కలిపి మొత్తం రూ.199.94 కోట్లను సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa