ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను పదవుల కోసం ప్రాకులాడే వ్యక్తిని కాదు: డియల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 07:47 PM

మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పనితీరు అవినీతి పై ఆయన అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై, ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వ్యవసాయ సలహాదారులు తిరుపాల్రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపాటు. శుక్రవారం కాజీపేటలో ఆయన మాట్లాడుతూ. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదని, ఎమ్మెల్యే రఘురాం రెడ్డి నన్ను ఏ పార్టీ దగ్గరకు రానివ్వదు అన్నారు. నేను ప్రాకులాడే వ్యక్తిని కాదు వారికి అవసరమైతేనే నన్ను దగ్గరికి తీసుకుంటారు.


ఎమ్మెల్యే రఘురాం రెడ్డికి చాలెంజ్ చేసి చెప్తున్నా నేను రాజకీయాలకు వచ్చేసరికి ఆరు ఎకరాల భూమి మాత్రమే ఉందన్నారు. 1977లో నా తండ్రి బాగ పరిష్కారాల కింద 31 ఎకరాల వ్యవసాయ భూమి కడపలో ఇల్లు బంగారు అదేవిధంగా నా చెల్లెలు పెళ్లి కోసం పది ఎకరాల పొలము ఇచ్చాడు. రఘురాం రెడ్డికి కళ్ళు ఉంటే వచ్చి చూసుకోవచ్చు డాక్యుమెంట్లు ఇస్తాను అని అన్నారు. రఘురామిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చాక ఏ ఆస్తి అమ్మడో చెప్పాలని ఆయన అన్నారు.


తిరుపాల్రెడ్డికి సిగ్గు ఉంటే నేను వెన్నుపోటు దారుదని మాట్లాడిన నువ్వు చర్చ కు సిద్ధమా. మొదటినుండి నా ప్రత్యర్థి రఘురాంరెడ్డి కుటుంబం వాళ్లతోనే పోటీ చేస్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీకి సహకారం అందించాను పార్టీలో చేరలేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా, నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా చాపాడు మండల ప్రచారం చేసాం. రఘురాం రెడ్డి రాజకీయ స్వార్థం మనుగడ కోసం జగన్ చెంత చేరి నన్ను విమర్శించేవారా అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa