మానవత సేవా సంస్థ శాంతి సమ సమాజానికి నాంది అని మానవత అధ్యక్షులు కనపర్తి శివశంకర్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం రాయచోటి సుండుపల్లి రోడ్డు మార్గంలో నున్న కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయం లో మానవత స్వచ్ఛంద సంస్థ సెక్రెటరీ వెంకట రమణ నాయుడు, చైర్మన్ ఆరమాటి శివగంగి రెడ్డి అధ్వర్యంలో విద్యార్థులకు నైతిక విలువల పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ తో మెలగలన్నారు. పట్టుదల తో చదివితేనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు.
ప్రతి విద్యార్థిని లో నైతిక విలువలు కలిగి ఉండడంతో పాటు సేవా తత్వం అనే లక్షణాలు కలిగి ఉండాలన్నారు. కష్టాలలో ఉన్న వారి పట్ల సానుభూతి చూపించి ఆత్మస్థైర్యాన్ని అందించాలన్నారు. అనంతరం ఉత్తమ విద్యార్థులు హరిత, వందన, ఆశ లకు నగదు ప్రోత్సాహకాల తో పాటు మానవత ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవత జిల్లా డైరెక్టర్ బ్రహ్మానంద రెడ్డి , జిల్లా సెక్రెటరీ వెంకట్రామ రెడ్డి, మాజీ అధ్యక్షులు వెంకటేష్, గౌరవ సలహాదారుడు వెంకటరమణ, మాజీ సెక్రటరీ సుదర్శన్ రెడ్డి, సభ్యులు విశ్రాంత ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ శశికళ, జూనియర్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa