ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం పేద ప్రజలకు చేయూతనిచ్చే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరే విధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేశారని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె. రాజు అన్నారు. ఈమేరకు జీవీఎంసీ 55 వ వార్డు కార్పొరేటర్ శశికళ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కెకె. రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పధకాలు అందుతున్న తీరును స్థానికులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం లో ప్రజల నుండి స్వీకరించిన వెనుతులను తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈసందర్బంగా కెకె. రాజు మాట్లడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు.
అదే విధంగా అభివృద్ధి విషయంలో ప్రజలకు కల్పించాల్సిన మౌలిక వసతులకు సంబంధించి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విశాఖ నగరం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళా సాధికారత, విద్య, ఉపాధి తదితర వాటిపై దృష్టి సారించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సుపరి పాలన అందిస్తున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa