టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ను విజయవంతం చేయాలని మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు కోరారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... పాదయాత్రకు మద్దతుగా మచిలీపట్నంలో ఎన్టీఆర్ విగ్రహానికి కొనకళ్ల, టీడీపీ నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా నారా లోకేష్ 'యువ గళం ' పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సమస్యలను అధ్యయనం చేసేందుకు లోకేష్ పాదయాత్ర చేయనున్నారని అన్నారు. యువతను చైతన్యం చేస్తూ లోకేష్ పాదయాత్ర సాగనున్నట్లు చెప్పారు. 400 రోజులు 4వేల కిలో మీటర్ల పాదయాత్ర ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa