వైకుంఠ ఏకాదశి రోజున దైవ దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగి ఎంతో పుణ్యం వస్తుందని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. సోమవారం మేయర్ దంపతులు సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రుషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు మేయర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నగరమైన మాట్లాడుతూ మార్గశిర మాసం శుకలపక్షం ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారని, ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగి ఎంతో పుణ్యం లభిస్తుందని తెలిపారు. ఈ వైకుంఠ ఏకాదశి మహావిష్ణువు ఎంతో ప్రీతి మైనదని ఆ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి స్వర్గం లభిస్తుందని భక్తుల నమ్మకం అని తెలిపారు. ఈ సంవత్సరం నగర ప్రజలకు మంచి పాలన తోపాటు నకరాభివృద్ధి జరిగేలా చూడాలని ఆ స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa