చిన్నారుల వైద్యం కోసం ఎపుడూ ముందుండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మరోసారి గొప్ప మనసు చూపారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారి హనీకి.. అన్ని విధాల అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను.. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు కలిశారు. హనీ పుట్టినరోజు సందర్భంగా జగన్ ఆశీర్వాదం తీసుకున్నారు. చిన్నారికి శుభాకాంక్షలు చెప్పిన జగన్.. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
చిన్నారి హనీ.. గాకర్స్ వ్యాధితో బాధపడుతోంది. పాపకు చికిత్స చేయించడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. ఆర్థికంగా బాగా చితికిపోయారు. ఆ సమయంలోనే.. ముఖ్యమంత్రి జగన్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. అప్పుడు చిన్నారి హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబు జగన్ కలిశారు. పాప బాధ గురించి వివరించారు. చలించిపోయిన జగన్.. చిన్నారి హనీ చికిత్స కోసం రూ.1 కోటి మంజూరు చేశారు. చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లతో పాటు నెలకు రూ.10 వేలు పెన్షన్ కూడా అందించాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో పాపకు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్న చిన్నారి హనీని చూసి సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం హనీ పుట్టిన రోజు సందర్భంగా.. జగన్ను హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబు కలిసి కృతజ్ఞతలు చెప్పారు. చిన్నారి హనీని సీఎం జగన్ ఆశీర్వదించారు. భవిష్యత్తులోనూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీంతో పాప తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa