శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత వలగొండ శంకర్పై అదే గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు శుక్రవారం దాడి చేశారు. శంకర్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. స్థానికుల సహకారంతో తప్పించుకున్న శంకర్, వెంటనే కనగానపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని దాడి గురించి ఆరాతీశారు. అనంతరం బాధితుడు కనగానపల్లి పోలీ్సస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వైసీపీ కార్యకర్త అయిన తాను, ఆ పార్టీలో శ్రేణులకు జరుగుతున్న అన్యాయాలను భరించలేక ఇటీవలే టీడీపీలో చేరానని, దీన్ని జీర్ణించుకోలేక వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి, ఆయన బంధువులు రమణారెడ్డి, నందమోహన్రెడ్డి, రాజారెడ్డి, హరికుమార్రెడ్డి మూకుమ్మడిగా కారులో వెళ్తున్న తనపై రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కారు నుంచి బయటకు ఈడ్చి దుర్భాషలాడుతూ భౌతికదాడికి దిగారని వాపోయారు. ‘‘రేయ్ పార్టీలో ఉంటూ.. టీడీపీలోకి చేరి మమ్మల్నే దూషిస్తావా? నీకెంత ధైర్యం? నిన్ను చంపుతాం..’’ అని కట్టెలతో దాడిచేశారని, తనకు రక్షణ కల్పించాలని బాధితుడు పోలీసులకు విన్నవించారు. కాగా, వలగొండ శంకర్ తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని పేర్కొంటూ వైసీపీ నాయకుడు, వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa